అయితే ఇంతకీ వారి వంటల్లో ఉల్లిపాయలను కానీ, తెళ్ళగడ్డలను కానీ ఎందుకు వాడరు అన్న విషయానికి వస్తే.. బ్రాహ్మణులు కుటుంబాల్లో నిత్య జీవన కలాపాలు, ఆహార నియమాలు వంటివి చాలా నిష్టగా పాటిస్తారు. కాలం మారే కొద్దీ కొంత మార్పు అయితే వచ్చింది. కానీ పురాతన కాలంలో అయితే ఎంతో పటిష్టంగా నియమాలను పాటించే వారు. బ్రాహ్మణులు సాత్విక ఆహారాన్ని తప్ప వేరే ఏ ఇతర ఆహార పదార్థాలను తినరు. ఘాటు వాసన వచ్చే ఆహార పదార్దాలను తినరు. ఎందుకంటే వారిలో ఎక్కువ బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణ, వేద పారాయణాలనే వృత్తిగా ఎంచుకుంటారు. ఇందుకు స్పష్టమైన ఉచ్చారణ అవసరం.
అందువలనే వీరు తమో, రజో గుణాలను కలిగించేటటువంటి ఆహార పదార్ధాకు పూర్తిగా దూరంగా ఉంటారు. అదే విధంగా ఉల్లిపాయ, తెళ్లగడ్డలు కూడా ఈ కోవకు చెందినవే. కాబట్టి వీటిని బ్రాహ్మణులు వారి వంటల్లో వాడరు. ఇవి చాలా ఘాటు వాసనను కలిగి ఉంటాయి, తినిన తర్వాత చాలా సేపు వరకు ఆ వాసన పోదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి