మనం ఎల్లప్పుడూ కూడా మన కాలేయాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల కాలేయం చాలా ఈజీగా శుభ్రపడుతుంది. అలాగే కాలేయ ఆరోగ్యం వెంటనే మెరుగుపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరిచే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి  మనం సొరకాయను, పసుపును, కొత్తిమీరను ఇంకా పుదీనాను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక సగం సొరకాయను ముక్కలుగా చేసుకుని ఒక జార్ లో వేసుకోని ఆ తరువాత ఇందులో గుప్పెడు కొత్తిమీరను, పుదీనాను వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకోని తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే అర చెక్క నిమ్మరసం వేసి కలపాలి.


ఆ తరువాత ఇందులో మన రుచికి తగినట్టు నల్ల ఉప్పును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ప్రతి రోజూ కూడా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తరువాత తాగాలి. అలాగే ఈ జ్యూస్ ను తాగిన తరువాత గంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.ఇక ఈ జ్యూస్ ను తాగడంతో పాటు ప్రతి రోజూ రాత్రి అరకప్పు ఎండు ద్రాక్షలను నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ ఎండు ద్రాక్షలను ఒక గ్లాస్ నీటిలో వేసి చిన్న మంటపై ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత ఈ నీటిని తాగడంతో పాటు ఎండు ద్రాక్షలను కూడా తినాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా కాలేయ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కాలేయం కూడా బాగా శుభ్రపడుతుంది. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు తగ్గడంతో పాటు ఫ్యూచర్ లో కూడా మన దరి చేరకుండా ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ జ్యూస్ తాగండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: