పాదాలు పగళ్లడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పాదాలపై మృతకణాలు పేరుకుపోవడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం ఇంకా శరీరం డీహైడ్రేషన్ కు గురి కావడం వంటి పాదాలపై చర్మం పొడిబారడం వంటి వివిధ కారణాల వలన పాదాల పగుళ్లు ఏర్పడతాయి. చాలా మంది ఈ పగుళ్లను తగ్గించుకోవడానికి ఎన్నో రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. అయితే ఎలాంటి క్రీములు వాడే అవసరం లేకుండా పాదాల పగుళ్లను కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.అయితే పాదాల పగుళ్లను తగ్గించే ఆ టిప్ ఏమిటి.. ఇంకా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ టిప్ ని ఎలా ఉపయోగించాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక టీ స్పూన్ ఆవనూనెను, ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని, 2 కర్పూరం బిళ్లలను ఇంకా ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా మీరు ఒక గిన్నెలో ఆవనూనెను తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులో కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసుకోవాలి. తరువాత కొబ్బరి నూనె ఇంకా పెట్రోలియం జెల్లీ వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు రాసుకునే ముందు పాదాలను నీటిలో నానబెట్టి బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత తడి పోయేలా తుడుచుకుని ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆ తరువాత పాదాలకు సాక్స్ లు వేసుకుని నిద్రించాలి. పొద్దున పూట గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల తగినంత తేమ లభించి పాదాల పగుళ్లు చాలా ఈజీగా తగ్గుతాయి.అలాగే పాదాల చర్మం మెత్తగా ఇంకా మృదువుగా తయారవుతుంది. ఈ టిప్ ని పాటిస్తూనే పాదాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంకా అలాగే నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.మన శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుకోవాలి. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం మన పాదాల పగుళ్లను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: