ప్రస్తుత కాలంలో ఎల్ఐసి అందించే ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా ఇస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎల్ఐసి ప్రవేశపెట్టిన పథకాలలో డబ్బులు పెట్టుబడిగా పెడితే మంచిగా లాభాలు పొందవచ్చు. ఇకపోతే ఎల్ఐసి ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. పైగా వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక సమస్య ఎదురవదు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసి అధికంగా రిటర్న్స్ పొందడానికి ఇదే మంచి సమయం. భారతీయ జీవిత బీమా సంస్థ అంటే రిస్క్ ఉండదు.. పూర్తి సేఫ్ ని గుర్తించుకోవాలి. ఈ క్రమంలోనే ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ ఆనంద్ పాలసీ మంచి ఆదాయాన్ని అందిస్తుంది.

ఎల్ఐసి అందిస్తున్న ఈ పాలసీలో ప్రతిరోజు వంద రూపాయల చొప్పున 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే డబుల్  బోనస్ వస్తుంది. అలాగే మంచి బెనిఫిట్స్ తో పాటు బీమా కవరేజీ కూడా లభిస్తుంది. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే ఈ పథకాలలో చేరవచ్చు.  ప్రతిరోజు వంద రూపాయల చొప్పున తక్కువ పెట్టుబడి పెడితే నిర్ణీత మొత్తంలో ఎక్కువ రిటర్న్స్ లభిస్తాయి. రూ. 5 లక్షల హామీ మొత్తాన్ని కూడా మీరు పొందవచ్చు.. దీనికి రూ.8.60 లక్షల రివిజినల్ బోనస్ వస్తుంది.

అంటే లాభాలను రెట్టింపు చేయాలి అంటే 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.  అప్పుడు మాత్రమే డబుల్ బోనస్ ను  పొందడానికి వీలవుతుంది.  ఇప్పుడు ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి వార్షిక ప్రీమియంగా రూ.27,000 డిపాజిట్ చేయాలి.  నెలవారి ప్రీమియం దాదాపు రూ.2300గా ఉంటుంది.  21 ఏళ్లలో దాదాపు రూ.5.60 లక్షలు జమవుతాయి.  బోనస్తో కలిపి మొత్తం రూ.10 లక్షలు మీ చేతికి వస్తాయి . కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలను అందించే ఈ ఎల్ఐసి పాలసీలు మీకు ఆర్థికంగా మంచి భరోసాను అందిస్తాయి.  కాబట్టి మరెక్కడ పెట్టుబడి పెట్టకుండా ఎల్ఐసి పథకాలలో డబ్బు పెట్టి సురక్షితంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: