ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ కౌర్ వ్యవహరించింది. తెలంగాణ రాష్ట్రంలో సమంత చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రమోషన్ ను పూనమ్ కౌర్ నిర్వహించింది. 

పూనమ్ ను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం నియమించడంలో పవన్ కళ్యాణ్ సలహా సంప్రదింపులు ఉన్నాయి అంటూ అప్పట్లో వార్తలు కూడ వచ్చాయి. అయితే ఆతరువాత మారిన పరిస్థితులలో పూనమ్ పవన్ ను టార్గెట్ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ కూడ చేయడంతో పవన్ అభిమానుల టార్గెట్ లో పూనమ్ చిక్కుకుంది.

ఇప్పుడు రాజకీయంగా పరిస్థితులు మారిపోయి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో గత తెలుగుదేశ ప్రభుత్వం చేసిన నియామకాలు అన్నీ రద్దు అయ్యాయి. అయితే లేటెస్ట్ గా జరిగిన నేషనల్ హ్యాండ్ లూమ్ డే సందర్భంగా పూనమ్ కౌర్ చేనేత వస్త్రాలు ధరించండి అంటూ పిలుపు ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈమె చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తూ అమెరికాలోని 9/11 మెమోరియల్ దగ్గర చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 

ప్రస్తుతం జగన్ పవన్ ల మధ్య చాల దూరం పెరిగినప్పటికీ పూనమ్ ను ఇంకా ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్నారా లేకుంటే పూనమ్ హ్యాండ్ లూమ్ డే సందర్భంగా వ్యక్తిగత హోదాలో ఈ ఫోటోలు పెట్టిందా అన్న విషయమై పవన్ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పూనమ్ పవన్ పేరు ప్రస్తావించకుండా గతంలో పవన్ ను టార్గెట్ చేసిన నేపధ్యంలో ఆమె మళ్ళీ ఇలా వార్తలలోకి రావడం పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: