ఈచిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5కోట్లు రాబట్టాల్సి వుంది. అయితే అది అంత ఈజీ కాదనిపిస్తుంది. బుధవారం నుండి దేశ వ్యాప్తంగా సైరా హావ కొనసాగనుంది. దాంతో గద్దల కొండ గణేష్ ను ప్రేక్షకులను పట్టించుకోవడం కష్టమే.. సినిమా బాగుందని అనిపించుకున్న ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావడానికి తంటాలు పడుతుంది. దీనికి కారణం సరైన టైం లో రిలీజ్ చేయకపోవడమే. సైరా విడుదలకానున్న మూడు వారాల ముందే రిలీజ్ చేసివుంటే ఇప్పుడు ఈపరిస్థితి వచ్చేది కాదు. మరి
కోలీవుడ్ సూపర్ హిట్ గ్యాంగ్ స్టార్ డ్రామా 'జిగర్తండా' కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్, సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు.