టాలీవుడ్ లో రాయ్ లక్ష్మి నటించిన సినిమాలు పెద్ద విజయం సాధించకున్నా ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు.  తాజాగా శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్‘గర్జన’ మూవీ నిర్మించారు.   భారత దేశంలో మొట్టమొదటిసారిగా విఎఫ్ఎక్స్ తో రూపొందిన పులిమూవీ ద్వారా ఎక్కువసేపు వెండితెరమీద కనిపించనుంది.  అయితే ఇటు వంటి సినిమాలు ఇప్పటికీ వచ్చినా.. ఈ మూవీలో ఒక కృర మృగంతో ఎలాంటి సన్నివేశాలు.. ఎంత భయంకరమైన పరిస్థితులు హీరో, హీరోయిన్లు ఎదుర్కొంటారు అన్న విషయం చూపించబోతున్నారట. ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది. మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదు. అయితే ఈ రెండింటిలో ఏది ప్రమాదం.. ఈ అంశం ఆధారంగా తెరకెక్కిన మూవీనే 'గర్జన'.   ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

 

టామ్ అండ్ జెర్రీ కథ మాదిరిగా సాగే ఈ వేట చివరికి ఎలా ముగుస్తుందో తెర మీద చూస్తేనే ఆ థ్రిల్ మీరు అనుభవిస్తారని అంటున్నారు చిత్ర యూనిట్. కథ, స్క్రీన్ప్ ప్లే, సినిమాట్రోగ్రఫీ ఎంవీ పన్నీర్ సెల్వమ్ నిర్వర్తించారు. విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన పెద్దపులి ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత నరేష్ జైన్ తెలిపారు.  బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ మూవీ నిర్మించామని అంటున్నారు చిత్ర యూనిట్. జె.పార్తిబన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కించారు.

 

అయితే ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పార్తిబన్ పలు యాడ్ ఫిల్మ్లులు రూపొందించిన అనుభవముంది.  ఈ మూవీలో ఇంకా దేవ్ గిల్, నైరా, వైష్ణవి చంద్రన్ మీనన్, ద్వైత, బ్లాక్ పాండి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ఎడిటింగ్ సుదర్శన్, సంగీతం అరుళ్ దేవ్, ఆర్ట్ మిలన్ అండ్ ఎస్. రాజమోహన్, పీఆర్వో సురేష్ కొండేటి, వీఎఫ్ ఎక్స్ నాక్ స్టూడియోస్, డిజైన్స్, మోషన్ టీజర్ ఆర్ ఆర్ట్ స్టూడియో.

మరింత సమాచారం తెలుసుకోండి: