వీటి అనంతరం ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలు ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటితో ఏకంగా జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభాస్ భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ని దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్, దాని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్న సినిమాతో పాటు, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఎంతో భారీగా తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో కూడా నటించనున్నారు.
వాస్తవానికి మిర్చి సమయంలో ప్రభాస్ తీసుకున్న పారితోషికం రూ. 15 కోట్లు మాత్రమే అని, ఇక ప్రస్తుతం ఆయన రాధేశ్యామ్ కు రూ. 85 కోట్లవరకు తీసుకుంటున్నారని, అలానే నాగ అశ్విన్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాలకు ఆయన రెమ్యునరేషన్ రూ. 100 కోట్లకు చేరిందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇక రేపు ఈ మూడు సినిమాలు రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధిస్తే అమాంతం ఆయన క్రేజ్ తో పాటు పారితోషికం కూడా పెరిగే ఛాన్స్ ఉందని, ఈ విధంగా పదిహేను కోట్ల నుండి వందకోట్ల వరకు అందరూ శభాష్ అనేలా ప్రభాస్ తన క్రేజ్ తో పాటు రెమ్యునరేష్ ని కూడా ప్రభాస్ పెను ప్రభంజనం సృష్టించారని అంటున్నారు విశ్లేషకులు ....!!