తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఏప్రిల్ 25వ తేదీన వెల్లడించిన
టాలీవుడ్ ముద్దుగుమ్మ
పూజా హెగ్డే పది రోజుల వ్యవధిలోనే
కరోనా వైరస్ ని తన్ని తరిమేశానని ఫ్యాన్స్ కి
గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న ఆమె ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు
బాలీవుడ్ లో కూడా కొన్ని పాన్
ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.
బాలీవుడ్ స్టార్
హీరో సల్మాన్ ఖాన్ తో కూడా కలిసి ఆమె ఒక
సినిమా చేయబోతున్నారు. అయితే తాజాగా
పూజ హెగ్డే ఈ
సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
"మేము చేస్తున్న
సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. ఈ సినిమాని ఎప్పుడో పూర్తిచేయాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి కారణంగా
సినిమా ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనాలని.. షూటింగ్స్ మళ్లీ పునః ప్రారంభించాలని ఆశిస్తున్నాను.
సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడానికి నేను చాలా ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్నాను. అతనితో కలిసి
సినిమా చేయడం ఇదే తొలిసారి. అతనితో అత్యంత త్వరగా సెట్ లో ఇంటరాక్ట్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను." అని
పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
లాక్డౌన్ తరువాత
పూజా హెగ్డే రణ్వీర్ సింగ్తో కలిసి
రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. ఆమె పాన్-ఇండియా ప్రాజెక్ట్ అయిన రాధే
శ్యామ్ షూటింగ్ లో ప్రభాస్తో కలిసి పాల్గొన్నారు.
చిరంజీవి,
రామ్ చరణ్లతో కలిసి ఆచార్య
మూవీ సెట్స్ లో కూడా పాల్గొన్నారు. అయితే భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో చాలామంది నటీనటులు
కరోనా వైరస్ బారిన పడుతుండటం తో స్వచ్ఛందంగా దర్శకనిర్మాతలు షూటింగ్స్ నిలిపివేశారు. దీంతో
పూజా హెగ్డే ఇంటికే పరిమితమయ్యారు.