టాలీవుడ్ లో
హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత
బాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్టార్
హీరోయిన్ గా ఎదిగిన నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు
హీరోయిన్ తాప్సీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం
సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది తాప్సీ. ఆ తర్వాత తెలుగులో వరుస హిట్ సినిమాలు చేసి కొంత వరకు టాప్
హీరోయిన్ హీరోయిన్ గా ఎదిగేలా కనిపించింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా రాకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో ఆమె
టాలీవుడ్ ని నమ్ముకుంటే లాభం లేదని
బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు
బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే తాప్సీ నే గుర్తుకు వస్తుంది అక్కడి దర్శక నిర్మాతలకి. టాలీవుడ్ లో ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ఏది అంటే
గేమ్ ఓవర్. ద్విభాషా చిత్రంగా వచ్చిన ఈ
సినిమా తమిళంలో విడుదలై మంచి హిట్ అయ్యింది. బాలీవుడ్ లో ఆమె గత ఏడాది విడుదలైన తప్పడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించింది.
ఈ సినిమాకి గాను ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం లభించగా, ప్రేక్షకులపై మైమరచిపోయారు.ఇక ఈ
సినిమా ద్వారా భారీ హిట్ ను అందుకుంది తాప్సీ. మరో 4, 5 ఏళ్లు ఆమెకు ఎలాంటి డోకా లేదు అని ఈ చిత్రం తెలియజేసింది. ఆమె నటించిన సినిమాలు ఇప్పటికే పూర్తి కాగా మరో నాలుగు సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీన్ని బట్టి ఆమె
బాలీవుడ్ లో ఏ రేంజ్ లో బిజీ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె
బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత చాలా సంపాదించిందని తెలుస్తుంది. ఒక రిపోర్టు ప్రకారం దగ్గరున్న ఆస్తుల విలువ 43 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.. ఆమె ఒక్కో చిత్రానికి కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది.