టాలీవుడ్ లో ఇతర భాషల హీరోయిన్ ల దిగుమతి రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఈ నేపథ్యంలో తెలుగులో నటిగా హీరోయిన్ రాణించాలనుకునే వారికి ఆ అవకాశాలు గండి కొడుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి తెలుగులో హీరోయిన్ స్థాయి అమ్మాయిలు ఉన్న వారిని పట్టించుకోకుండా ముంబై నుంచి మలయాళం నుంచి హీరోయిన్ లను దిగుమతి చేసుకుంటున్నారు మన దర్శకనిర్మాతలు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న కంప్లైంట్. కానీ ఎవరూ పట్టించుకోకుండా పెద్ద హీరోలు ఈ రకం హీరోయిన్లకే మొగ్గు చూపుతుంటారు.

అక్కడి వారిని ఇక్కడికి తీసుకువచ్చి అందలం ఎక్కించి వారిని స్టార్ హీరోయిన్ లు గా చేస్తూ ఉంటారు మన వారు. కానీ మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా తెలుగు వారికి అవకాశాలు తగ్గిపోతాయని, మాలాంటి వారికి ఇక్కడ నటించడానికి అవకాశం లేదని ఎంతో బాధపడుతుంది అచ్చ తెలుగు అమ్మాయి ప్రశాంతి. బుల్లితెరపై యాంకర్ గా అడుగు పెట్టి ప్రేక్షకులను ఎంతగానో అలరించి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది.  టాలీవుడ్లో అవకాశాల కోసం కష్టపడిన ఆమెకు సరైన అవకాశం, గుర్తింపు దక్కలేదట. యాంకర్ ప్రశాంతి ను అందరూ మరచిపోతున్న సమయంలో గృహలక్ష్మి సీరియల్ లో లాస్య పాత్రలో నటించి మళ్లీ ఫామ్ తెచ్చుకుంది. 

ఆ పాత్ర ద్వారా ఆమెకు ఎంతో ఆదరణ లభించింది. ఆమె తెలుగు సినిమా లో తెలుగు హీరోయిన్ ల పరిస్థితి గురించి మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే చాలా బాధగా ఉందని, ఇతర భాషల హీరోయిన్ లను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అదే అవకాశాలను మంచి నటులను గుర్తించి ఇస్తే బాగుంటుందని అన్నారు ఆమె. ఇక్కడ చాలా మంది టాలెంట్ నటీనటులు ఉన్నారని మన ఇండస్ట్రీ ముందు తెలుగు వాళ్ళని ప్రోత్సహించి ఆ తర్వాత పరభాషా నటులకు వెళితే బాగుంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: