విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ప్రేక్షకులను తన అందంతో మంత్రముగ్దులను చేసి విశ్వసుందరిగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. యుక్త వయసులోనే మోడలింగ్ రంగం లో ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈమె
హీరోయిన్ గా
బాలీవుడ్ సినిమాలు చేసి స్టార్
హీరోయిన్ గా ఎదిగింది.
ఐశ్వర్య రాయి ని తమ సినిమాల్లో నటింప చేయాలని దేశంలోని ప్రతి ఒక్క దర్శకనిర్మాత ఆరాటపడేవారు. సౌత్ లో కూడా ఆమె నటించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపేది. నిజానికి చెప్పాలంటే ఆమె దక్షిణాదిన ఇద్దరూ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత
బాలీవుడ్ లో హిట్ సినిమాలు చేసి ఆమె తన స్థాయిని పెంచుకుంది.
సినిమా అవకాశాలు మెండుగా వస్తున్న సమయంలోనే
ఐశ్వర్య రాయ్
అభిషేక్ బచ్చన్ ను
పెళ్లి చేసుకుని ఆమె అభిమానులను ఎంతో నిరాశ పరిచింది. అమితాబచ్చన్ కొడుకు
అభిషేక్ బచ్చన్ కు
భార్య అయిన తర్వాత ఓ పాపకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ లో సినిమాలు చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తన కొత్త కొత్త ఫోటోలతో యువకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
ఇక తన సోషల్
మీడియా ఖాతాలో ఆమె తన
భర్త అభిషేక్ బచ్చన్ ని తప్ప ఎవర్ని ఫాలో కాకపోవడం విశేషం. దీన్నిబట్టి వీరిద్దరి మధ్య ఎంతటి అన్యోన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తుంది ఐశ్వర్యరాయ్. ఈ
సినిమా తర్వాత మరే
సినిమా అయితే ఇప్పటివరకు ఒప్పుకోలేదు. 2015 లో జజ్బా అనే
సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె సర్వజిత్, ఏ
దిల్ హై ముష్కిల్ అనే సినిమాలలో నటించింది. మరి భవిష్యత్తులో ఆమె ఏయే సినిమాలో నటిస్తుందో చూడాలి.