టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మొదట చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు .ఆ తర్వాత 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో బీరువా , రారా కృష్ణయ్య, తెనాలి రామకృష్ణ ,నిను వీడని నీడను నేనే , నక్షత్రం , మరియు ఇంకొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించాడు. ఈ సంవత్సరం కూడా 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' తో తెలుగు ప్రజలను మరొకసారి అలరించాడు. కేవలం తెలుగులో మాత్రమే సందీప్ కిషన్ తమిళ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి మెప్పించాడు. ఇలా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న సందీప్ కిషన్ ప్రస్తుతం 'గల్లీ రౌడీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జంటగా నేహా శెట్టి నటిస్తోంది.

ఈ సినిమాకు కోన వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరించడం తో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ను సెప్టెంబర్ మూడవ తారీఖు న విడుదల చేయాలని మొదట చిత్ర బృందం భావించారు. కాకపోతే ప్రస్తుతం ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ సందర్భంలో నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమనిగి  ప్రేక్షకులకు థియేటర్లకు వస్తున్నారు. అలాంటి సమయంలో మరో సినిమాతో పోటీపడి ఒకే రోజు సినిమాలు విడుదల చేయడం మంచిది కాదు అని భావించి మరో విడుదల తేదీనిచూసుకోవడం మంచిదని భావిస్తున్నట్లు అందుకే మా చిత్రాన్ని సెప్టెంబర్ 3వ తేదీ విడుదల చేయట్లేదు. కాకపోతే సినిమాను మాత్రం  సెప్టెంబర్ లోనే విడుదల చేస్తాం. సినిమా కొత్త విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: