తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా రెండు మూడు సంవత్సరాల తరువాత పెద్ద హీరోలు అందరూ ఒకేసారి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళందరూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారా..? లేదా వివిధ రకాలుగా సమయాలను కేటాయించుకుంటున్నారా..? అనే స్పష్టత అయితే ఎవరిలోనూ లేదు. ఇకపోతే గత సంవత్సరం నుంచి పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయని , ఈ రోజు రిలీజ్ చేస్తామని..? త్వరలోనే ఆ రోజు వచ్చేస్తుంది..?అంటూ ప్రేక్షకులను ఈ బడా హీరోలు కూడా బాగా ఊరించేస్తున్నారు.

ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకే ఓటు వేసే ప్రభాస్ కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ప్రభాస్ మాత్రమే కాదు రీమేక్ సినిమాలతో మన ముందుకు వచ్చి, అలరించడానికి సిద్ధంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన సినిమాలతో ప్రేక్షకులకు ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్నాయి. వీరి బాటలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్,  రవి తేజ , పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలు కూడా ఉండడం గమనార్హం.

మొదటిసారి అల్లుఅర్జున్ తో  పాన్ ఇండియా మూవీ అని ప్రకటించిన సుకుమార్ , అప్పుడప్పుడు లీకుల బెడద తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షార్ట్స్ ను చూస్తుంటే , ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పలేం ..అలాగని డిజాస్టర్ గా మిగులుతుందని కూడా చెప్పలేము. ఇకపోతే సినిమా మేకర్స్ తమ సినిమాలకు సంబంధించిన,  కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని మాత్రమే టీజర్లో విడుదల చేస్తూ ప్రేక్షకులలో  ఉత్కంఠ నెలకొల్పుతున్నారు. అయితే ఇటీవల సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ టీజర్లు కానీ, క అన్ని ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి . కానీ ఎంత మాత్రం ఈ సినిమాలు సక్సెస్ అవుతాయో మాత్రం ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నారు.

అంతేకాదు ఇంత కాలం ఎదురు చూసిన తర్వాత ఆ సినిమా హిట్టయితే , అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఒకవేళ డిజాస్టర్ గా మిగిలితే,  అటు బడ్జెట్ పరంగా కానీ ఇటు ప్రేక్షకుల పరంగా కానీ అందరూ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతారో ..? ఏమో ..? అని సినీ ఇండస్ట్రీలోని పెద్దలు తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: