పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా బీమ్లా నాయక్ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల పవన్ ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్, మాటలు అందిస్తున్నారు. వాస్తవానికి ఇటీవల మలయాళం లో విడుదలై మంచి సక్సెస్ కొట్టిన అయ్యప్పనుం కోషియం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని మన తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునేలా కొద్దిపాటి మార్పులు చేసి తీస్తున్నట్లు టాక్. ఇక దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు మూవీ కూడా చేస్తున్నారు పవన్. అలానే త్వరలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ చేయనున్న పవన్, ఆపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు.

కాగా హరీష్, సురేందర్ రెడ్డి ల సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ పవన్ జన్మదినమైన సెప్టెంబర్ 2న రిలీజ్ కానున్నట్లు టాక్. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, పవన్ తో సురేందర్ రెడ్డి తీయనున్న సినిమా భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీ అని, ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ ఇటీవల ఎంపికైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే అనిరుద్ తో మేకర్స్ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే గతంలో పవన్ తో అనిరుద్ చేసిన అజ్ఞాతవాసి తరువాత ఇది వారిద్దరి కాంబోలో రానున్న రెండవ సినిమా అవుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: