టాలీవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల క్రేజ్ నడుస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెల్సిందే. ఈ సినిమాని సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్‌ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

అయితే ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు 'స్వాగ్ ఆఫ్ డానియల్ శేఖర్' తో రాబోతున్నట్టు అందుకు సిద్ధంగా ఉండలని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ తాజా అప్డేట్ కోసం రానా అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెల్సిందే.

భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు రీమేక్‌గా తెలుగులో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసుకుని మరి ఈ సినిమాను సాగర్ కే చంద్ర రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

కాగా.. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..  2 గంటల 57 నిముషాల రన్ టైంతో ఈ సినిమాను ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడతుడటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుండగా.. పవన్‌కు జోడీగా నిత్యా మీనన్.. రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. త్వరలో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ సన్నద్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: