టాలీవుడ్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం 13 డిసెంబర్ 2018 న జరిగింది. కాగా పెళ్ళైన ఎనిమిది నెలలకే విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ జంట. అయితే విడాకులు అనంతరం నేను చాలా స్వేచ్చగా సంతోషంగా జీవిస్తున్నాను అంటూ శ్వేత బసు ప్రసాద్ చెప్పడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. "కొత్తబంగారు లోకం" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఒక్క సినిమాతో అన్ని విధాలుగా అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఆ తరవాత చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.  ఆ మధ్య "గ్యాంగ్‌ స్టర్స్‌" అనే వెబ్‌ సిరీస్‌తో సందడి చేసింది ఈ చిన్నది. సినీ రంగం అనే రంగుల ప్రపంచంలో ఎవరు ఎపుడు ఎలాంటి స్థానంలో ఉంటారన్నది ఎవరూ ఊహించలేరు. అయితే కొందరు లక్సరీ లైఫ్ కి అలవాటు పడి తప్పుడు దార్లు తొక్కి విమర్శల పాలవుతుంటారు. అలాగే నటి శ్వేత బసు ప్రసాద్ కూడా ఇదే తరహాలో వ్యభిచారం చేస్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం, ఆ కారణంగా కొన్ని రోజులు పాటు జైలులో ఉండటం కూడా జరిగింది.  అనంతరం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

డైరెక్టర్ మిట్టల్ శ్వేత గురించి అన్ని విషయాలు తెలిసే చేసుకున్నాడు.  వీరి పెళ్లి ఎంతో ఘనంగా, వైభవంగా జరిగింది. అయితే ఏమయ్యింది ఏమో కానీ పెళ్ళైన ఎనిమిది నెలలకే తన భర్తతో విడాకులు తీసుకుని దూరమయ్యింది శ్వేత బసు ప్రసాద్. కానీ వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటని కొన్ని రోజులు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం మిట్టల్ శ్వేతను పదే పదే గతాన్ని గుర్తు చేస్తూ నొప్పించేవాడని తెలుస్తోంది. అయితే ఇలా ప్రతి రోజూ జరుగుతుండడంతో ఇక తట్టుకోలేక తన నుండి విడిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: