సూపర్ స్టార్ మహేష్ బాబు తో పరశురామ్ తీస్తున్న సర్కారు వారి పాట మూవీ మంచి మాస్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతుండగా కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైఒపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి తొలిసారిగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. త్రివిక్రమ్ మాటలు, స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకుడు .
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ తీస్తున్న ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలను మొదటగా 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం రెండు మూవీ యూనిట్స్ అధికారికంగా ప్రకటించాయి. అయితే అనంతరం భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో వీరిద్దరూ తమ మూవీస్ ని వాయిదా వేసుకున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే నాలుగు రోజుల క్రితం ఆర్ ఆర్ఆర్ కూడా వాయిదా పడడంతో అనేక చిన్న సినిమాలు సంక్రాంతి రిలీజ్ కి క్యూ కట్టాయి. ఇక ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటిస్తున్న హీరో మూవీతో పాటు చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సూపర్ మచ్చి సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి.
తొలిసారిగా గల్లా అశోక్ నటిస్తున్న హీరో మూవీ పై ఘట్టమనేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సూపర్ మెచ్చి మూవీలో రచిత రామ్, రియా చక్రవర్తి హీరోయిన్స్ గా నటిస్తుండగా పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉండడం విశేషం. మొత్తంగా ఈ సంక్రాంతికి పవర్ స్టార్ స్టార్, సూపర్ స్టార్ వస్తారు అనుకుంటే వారి వారి అల్లుళ్ళు వస్తుండడం మొత్తంగా భలే యాదృచ్చికం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: