టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష స్టార్ హీరోలందరి సరసన నటించింది. తమిళ చిత్రాలతో కెరియర్ ని ఆరంభించి తెలుగులో 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో పరిచయమయ్యి ఇక్కడ కూడా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగారు. విమర్శకుల సైతం ప్రశంసలు కురిపించే నటన ఆమె సొంతం. అయితే ప్రస్తుతం ఈమె తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్, తమిళ బ్రాహ్మణుల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన శైలిలో నటించి గొప్ప గుర్తింపును పొందింది.

దాదాపు పదేళ్ల పైనే ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా రాణించి సత్తా చాటారు. ఇక ఈమె పెళ్లి విషయానికొస్తే ...అప్పట్లో శింబుతో త్రిష లవ్ లో పడిందని, ఆ తరవాత బ్రేకప్ లు జరిగాయని అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆ మధ్య ప్రముఖ బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియన్ తో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్న త్రిష ఆ తరవాత ఆ పెళ్లి చేసుకోకుండా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంట్లో చెప్పిన సంబందం మాత్రం అస్సలు చేసుకోనని, ఎప్పటికైనా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు త్రిష. అయితే తమ అభిమాన తార పెళ్లి వార్త వినేందుకు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ఇక త్రిష జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. తనకు ఎంతో నచ్చిన ఇల్లును ఇండస్ట్రీలో వచ్చిన కొత్తల్లో అమ్మేసారట. ఆ ఇల్లు కొనుగోలు చేసింది మరెవరో కాదు ఒకప్పటి  ప్రముఖ నటుడు భాను చందర్. టాలీవుడ్ లో అత్యదిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో తక్కువ పారితోషికంతో కెరియర్ మొదలయిన ఆ తరువాత వరుస అవకాశాలతో భారీగా పారితోషికం అందుకున్నారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా సమయంలో 30 లక్షల వరకు పారితోషికం తీసుకునే వారు , ఆ తరవాత 2020 లో తమిళ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న 96 సినిమా కి గాను 70 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: