వరుస సినిమాలతో భారీ ఫ్లాపులు అందుకుంటున్నాడు హీరో శర్వానంద్. ఇంతటి స్థాయిలో ఫ్లాపులు ఆయన కెరీర్లో గతంలో ఎప్పుడూ కూడా రాలేదనే చెప్పాలి. నటుడిగా ప్రేక్షకులలో బలమైన ముద్ర వేసుకున్న శర్వానంద్ సినిమాల పరంగా కూడా హిట్ కొడితే చాలా బాగుంటుంది అని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఆయనకు ఆఖరి చిత్రం ఏది అంటే శతమానం భవతి అనే చెప్పాలి. ఆ తరువాత కొన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఇంకొన్ని భారీ ఫ్లాప్ లు అయ్యాయి. ఏదేమైనా శర్వానంద్ స్థాయిలో మాత్రం హిట్ లు దక్కలేదు.

ప్రస్తుతం ఆయన రెండు మంచి కథా కథనాలు ఉన్న సినిమాలను చేస్తున్నాడు.  కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్న శర్వానంద్ మరో కొత్త దర్శకుడితో కలిసి ఒకే ఒక జీవితం అనే వినూత్నమైన సినిమా చేయబోతున్నాడు. టైం ట్రావెలింగ్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ మరొక ప్రపంచం లోకి తీసుకు వెళుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు విజయవంతం అయ్యి పూర్వవైభవం తీసుకురావాలని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పుడు శర్వానంద్ కూడా ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే తన కెరీర్ మునుపటిలా మారుతుందని భావిస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాలు ఏ విధంగా ఉంటాయో ముందు ముందు చూడాలి. ఫిబ్రవరి 25వ తేదీన శర్వానంద్ తన ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు విడుదలై భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా చేసుకోవడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: