టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'హరిహర వీరమల్లు'. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రత్నం ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కి జోడిగా మొదటిసారి ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది.కాగా  త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా అదిరిపోయే సెట్స్ వేయబోతున్నారని. అంతేకాదు ఢిల్లీలోని చాందినీ చౌక్ ను రీక్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

అయితే  అందుకోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు.ఇక క భారీగా ఉండే చాందినీ చౌక్ సెట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. అయితే అన్నట్టు ఈ సెట్ లోనే పవన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. కాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది.మొత్తానికి పవన్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ వస్తున్నాడు. అయితే మొదటిసారి.. 'హరిహర వీరమల్లు' సినిమాకి మాత్రం వరుసగా 25 రోజులు డేట్స్ ఇచ్చాడు.

ఇక నిజానికి మొదటి నుంచీ ఈ సినిమా బాగా లేట్ అవుతుంది. అయితే అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా.ఇక సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందట.అయితే  అలాగే నటీనటుల మేకప్ కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది.. దీని కారణంగా లేట్ అవుతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఇలా బల్క్ డేట్స్ ఇవ్వడం మంచి పరిణామం అనే చెప్పాలి..అన్నట్టు పవన్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: