చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడం, ఇలాంటి సినిమాల్లో పవన్ నటిస్తుండడం మొదటిసారి కావడంతో అందరికీ ఈ సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ మరియు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్నో విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే మధ్య లో ఈ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి. దానికి తోడు ఈ సినిమా ను పక్కన పెట్టి పవన్ వేరే సినిమాలు చేయడానికి వెళ్లడం కూడా జరిగింది. దాంతో ఈ సినిమా ఆగిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ పవన్ మళ్ళీ ఈ సినిమా ను పట్టాలెక్కించాలి అనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఆగస్టు కల్లా పూర్తి చేయాలనీ దర్శక నిర్మాతలకు సూచించారట పవన్. దీన్ని బట్టి పవన్ ఈ సినిమా ను ఎంతగా చేయాలనుకుంటున్నాడో అర్థం అవుతుంది. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను మొదలుపెట్టి సినిమా ను పూర్తి చేయాలి అనేది పవన్ ఆలోచన. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.