ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తున్నారు..కొత్త సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. ఇటీవల విడుదలయిన రాధేశ్యామ్ సినిమా అభిమానుల ను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ప్రభాస్ నెక్స్ట్ చేస్తున్న సినిమాలు అన్నా మంచి కథతో వస్తే బాగుండు అని అభిప్రాయ పడుతున్నారు.. ప్రస్తుతం డార్లింగ్ రెండు , మూడు సినిమాలలో నటిస్తున్నారు. అందులో ముందుగా సలార్ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచన లో ఉన్నారు చిత్ర యూనిట్..


కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు. త్వరలోనే మళ్ళీ షూటింగ్ మొదలు కానుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా మారుతుందనే టాక్ వినిపిస్తూ వస్తుంది. అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.



గతంలో వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన సంగతి అందరికి తెలుసు. సలార్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమాను లు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ప్రభాస్ ఫ్యాన్ ఒకరు డైరెక్టర్ కు లెటర్ రాసాడు. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదంటే సూసైడ్‌ చేసుకుంటానని రాసిన లెటర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు లుక్స్ తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వని ప్రశాంత్ నీల్ మరి ఇప్పుడు అభిమానుల కోసం అయిన దిగి వస్తాడెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: