టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'అడవి శేష్' హీరోగా రాబోతున్న సినిమా మేజర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా..అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరో అడివి శేష్ విడుదల చేసిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సినిమా టికెట్స్ కోసం మహేష్ బాబు ఇంకా హీరో అడివి శేష్ క్యూలో నిలబడతారు. అడివి శేష్, మహేష్ బాబు, యూట్యూబర్ నిహారిక మధ్య జరిగిన సీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోరి మరీ పిలిపించుకున్న ఈ 'పిల్ల' ఎవరబ్బా? అంటూ యూట్యూబర్ నిహారిక గురించి నెటిజన్స్ లో పెద్ద చర్చ మొదలు అయ్యింది.ఇక యూట్యూబర్ నిహారిక తన వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఆమె వీడియోలను సూపర్ స్టార్ మహేష్ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతాడట. అందుకే, ఆమె చేత మేజర్ సినిమాకు ప్రమోషనల్ వీడియోస్ కూడా చేయిస్తున్నాడు. గతంలో నిహారిక యష్, షాహిద్ కపూర్, అజయ్ దేవగన్ లతో వీడియోలు చేసింది. అలాగే రీసెంట్ గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట ప్రమోషన్స్ సందర్బంగా ఓ వీడియో చేసింది.



అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.ఇక మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ జూన్3 వ తేదీన రిలీజ్ కానుంది.ఇక ఇప్పటికే మేజర్ సినిమాకి సెన్సార్ అయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్‌ తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా గురించి సెన్సార్ రిపోర్ట్ విషయానికి సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని ఇంకా అలాగే సినిమాలో మంచి ఫీల్ ఉందని.. ఇంకా అలాగే దేశభక్తికి సంబంధించి కూడా ఈ చిత్రం గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని కూడా తెలుస్తోంది. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక మేజర్ సినిమాను జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంకా అలాగే ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తోంది. శ్రీ చరణ్ పాకల ఈ సినిమాకి సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ ఇంకా మలయాళ భాషలలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: