నిఖిల్ హీరోగా 2014వ సంవత్సరంలో వచ్చిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓ దేవాలయంలో జరుగుతున్న కొన్ని రహస్యాలను ఛేదించే క్రమంలో హీరో అతని స్నేహితుడు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్న బోతున్నారో అనే కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించ బోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాని కార్తికేయ -2 పేరుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్ డేట్ వచ్చింది వాటి గురించి చూద్దాం.


సముద్రం దాచుకున్న అతి పెద్ద ప్రపంచ రహస్యం.. ద్వారకా నగరం అని దీంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసింది. ఇప్పటికే దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 22న విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్ ను పెంచే పనిలో బిజీగా ఉన్నది


తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియో ని విడుదల చేసింది ఈ చిత్రంలో నిఖిల్ కార్తికేయ, అనుపమ పరమేశ్వరన్ ముగ్ధ పాత్రలో , బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ధన్వంతరి పాత్రలో నటించడం జరుగుతోంది. ఇక ఆదిత్య మీనా శాంతముగా ,సదానంద శ్రీనివాస్ రెడ్డి, తదితర పాత్రలు వైవా హర్ష కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఇంట్రెస్టింగ్ కథ తో వస్తున్న ఈ చిత్రం జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉంది మరి కార్తికేయ సినిమా అందుకున్న విషయం ఈ సీక్వెల్ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారు తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: