బీస్ట్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ తాజాగా తెలుగు దర్శకుడు అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో , తెలుగు నిర్మాత అయిన దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న వరిసు '(వారసుడు) సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అయ్యి విడుదల కానుంది. తమిళంలో వరిసు పేరుతో విడుదల కానున్న ఈ సినిమా , తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో తళపతి విజయ్ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా , ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన విజయ్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే... ఈ మూవీ లో ఇంట్రవెల్ సన్నివేశం దగ్గర ఒక అదిరిపోయే యాక్షన్ సన్నివేశం ఉంటుందట , ఆ సన్నివేశం కోసం నాలుగు కోట్లు పెట్టి ఒక అద్భుతమైన సెట్ ను చిత్ర బృందం వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.