టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకప్పుడు వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్న శ్రీను వైట్ల ప్రస్తుత కాలంలో మాత్రం ఆ రేంజ్ ఫామ్ ను కంటిన్యూ చేయడంలో కాస్త వెనుక బడి పోయాడు. శ్రీను వైట్ల చివరగా మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ అపజయం తర్వాత శ్రీను వైట్ల మంచు విష్ణు హీరోగా డి డి (డబల్ డోస్) అనే మూవీ ని ప్రారంభించాడు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేసి చాలా కాలమే అవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎలాంటి అప్డేట్ లు రాలేదు.  దానితో ప్రస్తుతం డీ డీ (డబల్ డోస్) మూవీ ని శ్రీను వైట్ల పెట్టినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల కూడా డీ డీ (డబల్ డోస్) మూవీ ని పక్కన పెట్టి మరో యంగ్ హీరో తో సినిమాను తెరకెక్కించాలని ఫ్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని తో శ్రీను వైట్ల ఒక సినిమాను సెట్ చేయడానికి చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది వరకే శ్రీను వైట్ల , రామ్ పోతినేని కాంబినేషన్ లో రేడీ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.  మరి కొన్ని రోజుల్లో రామ్ పోతినేని , బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: