తమిళనాడు స్టార్ విజయ్ టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించారు. ఈ తొక్కీసలాట జరగడంతో అక్కడినుండి స్పెషల్ ఫ్లైట్ లో విజయ్ తన ఇంటికి చేరుకున్నారు.కానీ మృతుల సంఖ్య ఒక్కొక్కరిగా పెరుగుతూనే ఉంది.కేవలం అర్ధగంటలోనే 40 మంది మరణించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ కాబట్టి మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఇంత మంది చనిపోవడానికి కారణమైన విజయ్ ని అరెస్ట్ చేస్తారా అని.. టీవీకే పార్టీ ర్యాలీని నిర్వహించుకుంటామని పోలీసుల దగ్గర పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నారట విజయ్.కానీ ఒక్కసారిగా అక్కడికి దాదాపు రెండు లక్షల మంది రావడంతో ఈ ఘోరం జరిగింది. 

అయితే పుష్ప-2 విడుదల సమయంలో అల్లు అర్జున్ బహిరంగ ర్యాలీ చేసిన సమయంలో ఒక మహిళ ప్రాణాలు పోయి ఆ మహిళ కొడుకు తీవ్ర గాయాలపాలైన సమయంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఒక్కరి ప్రాణాలకే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు ఇంతమంది ప్రాణాలను బలిగొన్న విజయ్ ని అరెస్టు చేయరా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందితే ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది విజయే కదా..విజయ్ ని జైలో వేయాల్సిందే కదా అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా మండి పడుతున్నారు.. మరి విజయ్ ని కూడా తమిళనాడు పోలీస్ అరెస్ట్ చేస్తారా అనేది చూస్తే అరెస్టు చేయరు కావచ్చు అని తెలుస్తుంది.ఎందుకంటే అల్లు అర్జున్ ఎలాంటి పర్మిషన్ లేకుండానే తన సినిమా హిట్ అయిన ఆనందంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు కానీ విజయ్ మాత్రం పదివేల మందికి అనుమతి తీసుకున్నారు.

కానీ అనూహ్యంగా అక్కడికి ఎక్కువమంది వచ్చారు. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగింది.విజయ్ అనుమతి తీసుకున్నారు కాబట్టి ఆయన్ని అరెస్టు చేయరనే వార్తలే వినిపిస్తున్నాయి. కానీ అరెస్టు చేయకపోయినప్పటికీ తమిళనాడు ప్రజల నుండి మాత్రం ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఎందుకంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే కనీసం విజయ్  హాస్పిటల్ కి వెళ్లి మృతి చెందిన వారి కుటుంబాలను తీవ్రగాయాలతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వారిని పరామర్శించకుండా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. దీంతో ఈయన తీరుపై చాలామంది విమర్శలు చేస్తున్నారు.కష్ట సమయంలో దగ్గరే ఉండి వారి బాగోగులు చూసుకోవాల్సింది పోయి ఏమి పట్టనట్లు ఇంటికి వెళ్లిపోయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు. నా గుండె పగిలిపోయింది.

నా ప్రాణం విలవిలాడుతోంది. చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక విజయ్ ని అరెస్ట్ చేస్తారా అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని మీడియా ప్రశ్నించగా..బయట వచ్చే ఊహగానాలన్నింటికి నేను సమాధానం చెప్పలేను. ఈ ఘటనపై రాజకీయ వ్యాఖ్యలు చేయలేను.ఏదైనా సరే విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాము..అంటూ తెలిపారు. అలాగే హాస్పిటల్లో తీవ్ర గాయాలపై చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు చనిపోయిన మృతుల కుటుంబాలకు 10 లక్షలు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: