నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ ధియేటర్ లో జరిగిన ‘లైగర్’ మూవీ ట్రైలర్ లాంచ్ లో విజయ్ దేవరకొండ అత్యుత్సాహంతో అదేవిధంగా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. తనను చూసి ధియేటర్ దద్దరిల్లెలా హడావిడి చేస్తున్న తన అభిమానులను ఉద్దేశించి విజయ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


తన తండ్రికి అదేవిధంగా తన తాతకు ఎలాంటి చెప్పుకోతగ్గ బ్యాక్ గ్రౌండ్ లేదనీ అలాంటి కుటుంబం నుంచి వచ్చిన తన పై తన అభిమానులు చూపిస్తున్న ప్రేమతో తనకు మాటలు రావడం లేదని అంటూ తాను నటించిన సినిమాలు ఫెయిల్ అవుతున్నప్పటికీ తనను ఇంతగా అభిమానిస్తున్న అభిమానులకు ఈసినిమాను అంకితం చేస్తున్నాను అంటూ ప్రకటన చేసాడు. వాస్తవానికి తనకు డాన్స్ రాదనీ అదేవిధంగా స్టెప్స్ వేయడం కూడ చాల అసౌకర్యంగా ఉంటూ ఇష్టం ఉండదనీ అయితే తన అభిమానుల కోసం ఈమూవీలో స్టెప్స్ వేసాను అంటూ తన అభిమానులకు జోష్ ను ఇచ్చాడు.


ఇదే సందర్భంలో మాట్లాడిన పూరీ జగన్నాథ్ మరో అడుగు ముందుకు వేస్తూ ఈమూవీ విడుదలైన ఆగష్టు 25 తరువాత దేశంలోని అందరు విజయ్ దేవరకొండ గురించి అదేవిధంగా ‘లైగర్’ మూవీ గురించి మాట్లాడుకుంటారు అని చెపుతూ ఈమూవీ పై మరింత అంచనాలు పెంచేసాడు. దీనితో విజయ్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోయినప్పటికీ ఈమూవీ పై విపరీతంగా పెరిగిన అంచనాలు ఈమూవీకి ఎంతవరకు సహాయపడతాయి అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.


ఈమూవీ ట్రైలర్ లో రమ్యకృష్ణ ‘బాహుబలి’ శివగామి తరహాలో చాల ఉద్వేగభరితంగా ‘నా కొడుకు సింహా నికి పులి కి పుట్టిన క్రాస్ బీడ్’ అన్న పవర్ ఫుల్ డైలాగ్ విన్నవారికి ఈమూవీ అటు కమర్షియల్ మూవీ కాకుండా అదేవిధంగా ఎంటర్ టైనింగ్ మూవీ కాకుండా క్రాస్ బీడ్ గా మారుతుందా అన్న సందేహాలు కొమ్దరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: