గతేడాది థియేటర్లలో విడుదలైన పుష్ప ది రైజ్ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవడానికి సమంత కూడా ఒక కారణమనే విషయం తెలిసిందే.ఊ అంటావా సాంగ్ ద్వారా సమంత యూత్ ను ఆకర్షించడంతో పాటు ఆ పాట వల్ల వార్తల్లో కూడా నిలిచారు. గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన ఆ పాట విషయంలో చాలామంది పురుషుల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. మరోవైపు సమంత స్పెషల్ సాంగ్స్ కు ఓకే చెప్పడం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపించాయి.


అయితే కాఫీ విత్ కరణ్ షోలో సమంత మాట్లాడుతూ నేను, నాగచైతన్య విడిపోయిన సమయంలో నా గురించి నెగిటివ్ ప్రచారం జరిగిందని అన్నారట.. ఆ సమయంలో నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించడానికి నా దగ్గర జవాబులు లేవని సమంత చెప్పుకొచ్చారు. నేను ఓపెన్ గా ఉండాలని అనుకున్నానని అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పానని సమంత తెలిపారు. నాగచైతన్యతో విడిపోయిన కొన్నిరోజుల తర్వాత ఊ అంటావా సాంగ్ లో నాకు ఛాన్స్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారట.


 


ఊ అంటావా సాంగ్ నాకు ఎంతో నచ్చిందని ఈ కారణం వల్లే సాంగ్ లో యాక్ట్ చేశానని సమంత కూడా చెప్పుకొచ్చారు. పురుషాధిక్య సమాజంలో పురుషుల లోపాలు ఎత్తిచూపడానికి ఊ అంటావా సాంగ్ సరైనదని నేను భావించానని సామ్ కామెంట్లు చేశారట.నాలాంటి స్టార్ సెలబ్రిటీ చెబితే ఈ పాట అందరికీ చేరవవుతుందని భావించానని సామ్ అన్నారు.


 


కరణ్ జోహార్ భర్త నుంచి విడిపోయిన సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నావని అడగగా భర్త కాదు మాజీ భర్త అని సమంత సమాధానం కూడా ఇచ్చారు. అయితే సమంత భవిష్యత్తులో మా మధ్య సఖ్యత వస్తుందేమో అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ వల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో చైసామ్ మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: