మంచి విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్  నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగష్టు 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఎనిమిదేళ్ల కిందట సూపర్ హిట్ అందుకున్న 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'కార్తికేయ 2' ట్రైలర్‌తోనే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకుని మొదటి ఆట నుంచే అదరగొడుతోంది.మొదట్లో చాలా పరిమిత థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్యాక్డ్ హౌస్‌లతో వావ్ అనిపిస్తోంది.. తెలుగులో ఇరగదీస్తోన్న ఈ సినిమా హిందీ రాష్ట్రాల్లో కూడా ఇరగదీస్తోంది. మొదట 50 స్క్రీన్స్‌తో ప్రారంభంమైన ఈ సినిమా ఇప్పుడు 3000 పైగా స్క్రీన్స్‌తో వావ్ అనిపిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. సౌత్‌తో పాటు నార్త్ ఆడియెన్స్‌ను తెగఆకట్టుకుంటోన్న కార్తికేయ2 ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ కూడా క్రాస్ చేసింది. దీంతో కార్తికేయ2 టీమ్ ఈ సంబరాలను ఘనంగా నిర్వహించనుంది.


అందులో భాగంగా ఈ సెలెబ్రేషన్స్‌ను ఆగష్టు 26న సాయంత్రం 5 గంటలకు ఏపీలోని కర్నూల్ పట్టణంలో సాయంత్రం 5 గంటలకు జరుపనుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా కార్తికేయ2 టీం విడుదల చేసింది.ఇక హిందీలో ఈ సినిమా 12 రోజుల వరకు 9 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొమ్మిది రోజులకుగాను 25.కోట్ల పైగా షేర్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కోంటున్నాయి.ఇక మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా అదరగొడుతోంది. ఈ చిత్రం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన వన్ మిలియన్ డాలర్ మైలురాయిని కూడా దాటింది. అంతేకాదు నిఖిల్ సినిమా కెరీర్‌లో బెస్ట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక ఈ సినిమాని న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియాలో చాలా స్క్రీన్ లో రిలీజ్ చేస్తున్నారు.3 వ వారం నుంచి అక్కడ అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: