మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అయ్యాక రామ్ చరణ్ తన తర్వాతి సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తర్వాత సినిమాల గురించి చాలా రూమర్లు బయటకు వస్తున్నాయి.ఇందులో భాగంగానే రామ్ చరణ్ - శంకర్ సినిమా అయిన వెంటనే జెర్సీ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు ఇంకో కొత్త దర్శకుడు పేరు రామ్ చరణ్ తర్వాత సినిమాల లిస్టులో చేరింది.


ఆ దర్శకుడు మరి ఎవరో కాదు యువ దర్శకుడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ దర్శకుడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.అ తర్వాత రెండవ సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సాహో సినిమా తీసి కాస్త నిరాశపరిచాడు.ఇప్పుడు తన మూడో సినిమాని రామ్‌చరణ్ తో తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుజిత్ - రామ్ చరణ్ కి ఒక కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ కథ బాలీవుడ్ లో వచ్చిన ధూమ్ సినిమా లాగా ఉంటుందని భారీ యాక్షన్ తో రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో టాక్‌ నడుస్తుంది. రామ్ చరణ్ కి కథ నచ్చడంతో సుజిత్ కి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి రమ్మన్నాడట. శంకర్ సినిమా అయిన వెంటనే సుజిత్ తో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ వార్త బయటకు రావడంతో రామ్ చరణ్ అభిమానులు తోలుత షాక్ అయినా ధూమ్ లాంటి సినిమా రామ్ చరణ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా రామ్ చరణ్ అభిమానులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ కాంబో పై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: