ఆ దర్శకుడు మరి ఎవరో కాదు యువ దర్శకుడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ దర్శకుడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.అ తర్వాత రెండవ సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సాహో సినిమా తీసి కాస్త నిరాశపరిచాడు.ఇప్పుడు తన మూడో సినిమాని రామ్చరణ్ తో తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుజిత్ - రామ్ చరణ్ కి ఒక కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ కథ బాలీవుడ్ లో వచ్చిన ధూమ్ సినిమా లాగా ఉంటుందని భారీ యాక్షన్ తో రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. రామ్ చరణ్ కి కథ నచ్చడంతో సుజిత్ కి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి రమ్మన్నాడట. శంకర్ సినిమా అయిన వెంటనే సుజిత్ తో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ వార్త బయటకు రావడంతో రామ్ చరణ్ అభిమానులు తోలుత షాక్ అయినా ధూమ్ లాంటి సినిమా రామ్ చరణ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా రామ్ చరణ్ అభిమానులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ కాంబో పై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
ఆ దర్శకుడు మరి ఎవరో కాదు యువ దర్శకుడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ దర్శకుడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.అ తర్వాత రెండవ సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సాహో సినిమా తీసి కాస్త నిరాశపరిచాడు.ఇప్పుడు తన మూడో సినిమాని రామ్చరణ్ తో తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుజిత్ - రామ్ చరణ్ కి ఒక కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ కథ బాలీవుడ్ లో వచ్చిన ధూమ్ సినిమా లాగా ఉంటుందని భారీ యాక్షన్ తో రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. రామ్ చరణ్ కి కథ నచ్చడంతో సుజిత్ కి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి రమ్మన్నాడట. శంకర్ సినిమా అయిన వెంటనే సుజిత్ తో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ వార్త బయటకు రావడంతో రామ్ చరణ్ అభిమానులు తోలుత షాక్ అయినా ధూమ్ లాంటి సినిమా రామ్ చరణ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా రామ్ చరణ్ అభిమానులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ కాంబో పై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.