శాండిల్ వుడ్ హీరోలంతా ఇప్పుడు మన మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారు. ప్రతీ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే నేరుగా సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే దీనికి బాటలు వేసింది మాత్రం 'కేజీఎఫ్' అని చెప్పాలి.'కేజీఎఫ్' సినిమా కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచింది. యష్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలుగు మార్కెట్ లోనూ భారీ వసూళ్లను రాబట్టింది.  'కేజీఎఫ్ 2' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ మాత్రం సైలెంట్ అయ్యాడు. ఈ ఏడాది ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు.కాకపోతే ఇతర హీరోల లాగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు సెట్ చేసుకోవడం లేదు. 'కేజీఎఫ్: చాప్టర్ 2' తర్వాత ఇంతవరకూ తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటిచలేదు. పాన్ ఇండియా స్టార్ లాగా ఇండియా మొత్తం చాలా సౌండ్ చేస్తున్నాడు కానీ.. సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడం లేదు.


'కేజీఎఫ్ 2' సినిమా క్రేజ్ ని క్యాష్ చేసుకొని యష్ వెంటనే మరో చిత్రాన్ని ప్రారంభిస్తారని అందరూ భావించారు. కానీ అతను మాత్రం స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని నమ్ముతున్నట్లు అనిపిస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని షురూ చేయాలని కోరుకుంటున్నారు.ఇక రాకింగ్ స్టార్ యష్ కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 'కేజీఎఫ్ 2' తో టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఈ సినిమా విడుదల అయిన అన్నీ భాషల్లో కూడా 100 కోట్ల పైగా షేర్ రాబట్టి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1220 కోట్లు రాబట్టి ఇండియా చూపు అంతా కూడా కన్నడ ఇండస్ట్రీ వైపు తిప్పింది. ఇక రాకింగ్ స్టార్ యష్ అతని రాబోయే సినిమాలన్నీ తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: