టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ మూవీ తో హీరోగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత హలో ,  మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లలో హీరోగా నటించాడు. ఇందులో అఖిల్ ఆఖరుగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ మూవీbతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మమ్ముట్టి ఈ మూవీvలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ని విడుదల చేసింది.

ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఎలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ బళ్లారి లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో మమ్ముట్టి తో పాటు మరి కొందరు నటీనటులు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ మూవీ కి హిప్ హాప్ తమీజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: