తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్య మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన సుకుమార్ ఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి , ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న సుకుమార్ పోయిన సంవత్సరం పుష్ప ది రైస్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటించగా ,  రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు ,  తమిళ ,  కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్సాvఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇలా పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా ప్రేక్షకులు పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ ని కూడా భారీ ఎత్తున నిర్మించాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది.  అందులో భాగంగా ఈ మధ్యనే సుకుమార్మూవీ కోసం కొన్ని లొకేషన్ లను పరిశీలించగా ,  అవి ఈ దర్శకుడికి అంతగా సంతృప్తిని ఇవ్వనట్లు తెలుస్తుంది. దానితో సుకుమార్ హైదరాబాద్ లో భారీ సెట్ ను వేసి ,  ఈ మూవీ షూటింగ్ నీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: