సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈసారి సంక్రాంతికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పండగ వాతావరణం కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్టార్ హీరోల సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు అధికారికంగా ప్రకటించాయి. మరి ఈ సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ దగ్గర తలపడడానికి రెడీ అయినా సినిమాల వివరాలు తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతిvహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా  , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది  ఈ మూవీ తమిళ్ లో వరసు పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కానుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: