హీరోయిన్ స్వాతి అంటే చాలా మందికి తెలియదు.. కానీ కలర్ స్వాతి అంటే మాత్రం అందరు ఇట్టే గుర్తు పడతారు. ఎందుకంటే తన మొదటి షో తోనే అంతగా ఫేమస్ అయింది కలర్స్ స్వాతి.


పదహారేళ్ళ వయసులోనే కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది. ఇక ఆ ప్రోగ్రాం లో ఆమె చేసిన యాంకరింగ్, అందం, ఆమె చిరునవ్వు కు చాలా మంది దర్శక నిర్మాతలు ఫిదా అయ్యారు.దాంతో వారి సినిమాల్లో హీరోయిన్ గా కూడా చాన్స్ లు ఇచ్చారు. ఇక డేంజర్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిందట స్వాతి.


ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే స్వాతి కేవలం యాంకర్, హీరోయిన్ మాత్రమే కాదు.ఆమెలో మంచి సింగర్ కూడా ఉంది. ఈమె పాటలు చాలా బాగా పాడుతుందట. కానీ సినిమాల్లో పాటలు పాడాడానికి మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదట. కానీ కలర్స్ స్వాతి లో ఉన్న సింగర్ ని గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆమెను తాను మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఓ సినిమాలో పాట పాడమంటూ చాలా ఇబ్బంది పెట్టాడట. కానీ కలర్స్ స్వాతి దేవి శ్రీ ప్రసాద్ చెప్పిన కూడా పాటలు పాడడానికి ఏ మాత్రం కూడా ఆసక్తి చూపించలేదట. అయితే దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా పదేపదే ఫోన్లు చేస్తూ, మెసేజ్ లు పెడుతూ చాలా టార్చర్ చేశారట.


ఇక ఎంతకూ కలర్స్ స్వాతి వినకపోవడంతో ఏకంగా ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులతో చెప్పి మరీ ఒప్పించాడట.దీంతో కలర్స్ స్వాతి చేసేదేమీలేక డిఎస్పి టార్చర్ భరించలేక పాట పాడడానికి రెడీ అయిందట. అయితే కలర్స్ స్వాతి పాడిన పాట ఏంటో చాలా మందికి తెలియదు.ఆ పాట ఏంటంటే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమాలో. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా తమన్నా హీరోయిన్గా వచ్చిన ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనే పాట లో ఫిమేల్ వర్షన్ కలర్స్ స్వాతి పడిందట.. ఈ విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. ఇక ఈ పాట సినిమాలో ఎంత హైలెట్ గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కలర్ స్వాతి కొన్ని సినిమాల్లో నటించి కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: