మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి లో ఈ సినిమా యొక్క షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమాను వచ్చ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావించారు కానీ ఆ సీజన్లో చాలామంది సినిమాలు ఉండడం దానికి తోడు ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తేనే బాగుంటుంది అనే చిత్రం నిర్మాతలు ఓ అంచనాకు వచ్చారు.

దానికి తగ్గట్టుగానే ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా జరుగుతుందని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడం విశేషం. గతంలో రామ్ చరణ్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ చేసిన వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఫ్లాప్ కావడంతో ఆ సెంటిమెంట్ ఏమైనా రిపీట్ అవుతుందా అన్న భయం మెగా అభిమానులలో కలిగింది. కానీ శంకర్ లాంటి దర్శకుడు ఈ సినిమాను భారీ స్థాయిలోనే చేస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నవారు ఈ చిత్రంపై మంచి అంచనాలను కలిగి ఉన్నారు. 

సినిమా తర్వాత రామ్ చరణ్ చెయ్య బోయే సినిమా పై ప్రేక్షకులు ఎంతో అయోమయం నెలకొని ఉందని చెప్పాలి. చాలారోజులుగా ఆయన తదుపరి సినిమాను గౌతం తిన్న నూరి దర్శకత్వంలో చేయబోతున్నాడు అనే వార్తలు వినిపించాయి కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయిపోతున్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో రాంచరణ్ తదుపరి సినిమా ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన క్లారిటీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: