తమిళ స్టార్ హీరో శింబు ఎప్పుడు కూడా ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ స్టార్ హీరో కేవలం తమిళ ఇండస్ట్రీకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. శింబు నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. దీంతో తెలుగులో కూడా ఈ చిత్రాలు డబ్ అయ్యి కలెక్షన్ల పరంగా బాగానే రాబడుతూ ఉంటాయి. దీంతో తెలుగులో కూడా హీరో శింబు కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇక శింబు హీరోయిన్ లత నడిపే అఫైర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

హీరో తనతో ఏ కొత్త హీరోయిన్ కలిసి నటించిన వెంటనే పులిహోర కలిపేస్తారని వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉంటుంది. కొంతమంది ముద్దుగుమ్మలతో ఏకంగా కొన్నేళ్లపాటు డేటింగ్ కూడా చేశారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఇలా ఉండగా శింబు తమిళంలో నటించిన మానాడు చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఘనవిజయాన్ని అందుకున్నది. ఈ సినిమా రిమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ త్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారని వార్తలు వినిపి స్తూ ఉన్నాయి.

ఇక ఈ సినిమా దర్శకులు విషయంలో మొదటి నుంచి ఇద్దరు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అందులో హరిశంకర్, దశరథ మానాడు సినిమాను రీమిక్స్ చేస్తారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త దర్శకుడు లైన్లోకి వచ్చారు అన్నట్లుగా సమాచారం. ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్య పేరు వినిపించగా ఆ తర్వాత రవితేజ సిద్దు జొన్నలగడ్డ పేర్లు తెరపైకి వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ వాస్తవం కాదని తెలుస్తోంది. మానాడు మూవీని సురేష్ బాబు కుమారుడు రానా కోసమే తీసుకున్నట్లు సమాచారం రా నాకు అయితే ఈ సినిమా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావించడంతో ఈ చిత్రాన్ని తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: