తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా దిల్ రాజు ఎంతటి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కోలీవుడ్ల స్టార్ హీరో విజయ్ తో కలిసి వారసుడు అనే చిత్రాన్ని మొదటిసారి తెలుగు,తమిళంలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న విధానం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుచేత అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ బంద్ చేయాలని వాదన వినిపించినప్పుడు ఇది తమిళ సినిమా అని గట్టిగానే ప్రచారాలు చేశారు. అయితే మరొకవైపు హీరో విజయ్ తెలుగు తమిళనాడు తేడా లేకుండా వారసుడు చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని ఆలోచనలతో స్ట్రైట్ తెలుగు ఫిలిం అనే విధంగా కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఒక విధంగా దిల్ రాజుతో ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కూడా అదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది తమిళ హీరోలు తెలుగులో మంచి మార్కెట్ను అందుకుంటున్నారు. ఇక విజయ్ దళపతి కూడా సినిమాలకు ఇటీవల కాలంలో తెలుగులో మంచి ప్రేక్షకు ఆదరణ ఏర్పడింది. కాబట్టి తెలుగు డైరెక్టర్ తో తెలుగు నిర్మాతతో వారసుడు సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని వచ్చేయేడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అయితే ఈ సమయంలో వారసుడు సినిమాకి ఎక్కువ థియేటర్లు రావడం అంటే చాలా కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుచేతంటే తెలుగు సినిమాలు థియేటర్లో అన్ని కూడా పూర్తిస్థాయిలో దక్కిన తర్వాతే డబ్బింగ్ సినిమాలను కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు వారసుడు సినిమా పూర్తిస్థాయిలో తమిళమని డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా తమిళ మీడియాలో ఎక్కువగా ప్రచారాలు చేశారు. ఇక సంక్రాంతికి ఎన్నో బడా సినిమాలు విడుదలవుతూ ఉన్న నేపథ్యంలో మరి వారసుడు సినిమాతో దిల్ రాజుకు ఎక్కువ థియేటర్లు వస్తాయా రావా అనే విషయంలో భయపడుతున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: