తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సంవత్సరం దళపతి విజయ్ "బీస్ట్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. బీస్ట్ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ,  పూజా హెగ్డే ఈ మూవీ లో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. బీస్ట్ మూవీ భారీ అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ,  బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తర్కెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.  ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది. 

మూవీ తమిళ్ లో వరసు అనే పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల కాబోతుంది. తమిళ్ లో రూపొందుతున్న ఈ మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ లో రష్మిక మందన దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ మ్యూజిక్ హక్కులను టి సిరీస్ మ్యూజిక్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: