మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సూపర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ తల్లి గారు ఇందిరా దేవి గారు మృతి చెందడంతో మహేష్ సినిమాకి బ్రేక్ తీసుకున్నారు. తన తల్లిగారి పనులు అన్నీ అయిపోయాకా ఆ తరువాత ఆ బాధని మర్చిపోడానికి మహేష్ ఫ్యామిలీతో కలిసి లండన్ విహార యాత్రకు వెళ్లడం తెలిసిందే. ఇక ట్రిప్ ముగించుకొని మళ్ళీ తిరిగి మహేష్ హైదరాబాద్ చేరుకున్నారు. కానీ సినిమా షూటింగ్ తరువాతి షెడ్యూల్ అయితే ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ని మహేష్ కి వినిపించలేదట. ఆ కారణంగానే ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా ఫైనల్ స్క్రిప్ట్ ని మహేష్ బాబుకి త్రివిక్రమ్ వినిపించగా మహేష్ కి సూపర్ గా నచ్చేసిందట.


అయితే తరువాతి షెడ్యూల్ లో బుట్టబొమ్మ హీరోయిన్ పూజా హెగ్డే కూడా వుండాలి.ఎందుకంటే ఆమె మహేష్ తో కలిసి చేసే కాంబినేషన్ సీన్స్ వున్నాయట.అయితే ఇటీవల పూజా హెగ్డే కాలికి గాయం అవ్వడంతో ఆమె కూడా బ్రేక్  ఇచ్చి రెస్ట్ తీసుకుంటోంది. డిసెంబర్ నెలకి కానీ పూజా సెట్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు.అందువల్ల ఈ మూవీ తరువాతి షెడ్యూల్ ని డిసెంబర్ నెలలో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు పూజా హెగ్డే గాయం నయం కానుంది కాబట్టి తను కూడా సెట్ లోకి రావడానికి అప్పుడు సిద్ధంగా వుంటుంది. అందుకే డిసెంబర్ నెలలో షూటింగ్ తరువాతి షెడ్యూల్ ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక మరో విషయం ఏమిటంటే ఈ గ్యాప్ లో మహేష్ మరోసారి ట్రిప్ కి వెళుతున్నాడట.ఇలా ఏదో ఒక కారణంతో సినిమా షూటింగ్ రోజు రోజుకు కూడా పోస్టుపోన్  అవుతూనే ఉంది.మరి ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలం వెయిట్  చెయ్యక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: