తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమయ్యారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక తర్వాత అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటి సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. దీంతో నేషనల్ అవార్డు అందుకొని జాతీయస్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ -k చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఒక స్పై ఫిక్షన్ సోఫియా ఫాంటసీ జోనర్లు తెరకెక్కించడం జరుగుతుంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ స్టాండర్డ్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా సమయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది.. ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందని చిత్ర బృందం తెలియజేస్తూ ఉన్నారు.తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ సినిమా వరల్డ్ సెట్ ప్ ,మేకింగ్ ,ప్రాపర్టీస్ ,ప్రతిదీ పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలియజేశారు.

ప్రాజెక్ట్-k అనేది చాలా కొత్త సినిమా స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగానే ఉంటుందని తెలియజేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. బిల్డప్ చేసే వరల్డ్ టెక్నికల్గా అన్ని కొత్తవేనని ఒక రకంగా ఈ సినిమా ఎలా చేయాలి అన్నదానికి చాలా టైం పడుతోందని డైరెక్షకుడు తెలియజేశారు. ఈ సినిమా కోసం అన్ని కూడా కొత్తగా తయారు చేస్తున్నామని తెలియజేశారు. అయితే మహానటి సినిమాలో కార్లు కావాలంటే రెంటుకు తీసుకువచ్చారని కానీ ఈ సినిమాకు.. వెహికల్ కావాలంటే ఎక్కడా దొరకవని కార్లు తయారీ చేసుకోగలగాలి అనిట్ తెలియజేశారు డైరెక్టర్. ఇక మహేంద్ర గ్రూపు సంస్థ నుండి వీరికి అన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్  రూ.500 కోట్ల కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: