
ఇప్పటికే అన్ని భాషలలోనూ హిట్ అయిన దృశ్యం సీక్వెల్ ను కష్టాలలో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ప్రయత్నం చేసింది. అయితే దృశ్యం సినిమా ఇప్పటికే మూడు భాషలలో రావడం... ఓటిటి లలోనూ సందడి చేసి సక్సెస్ ను అందుకోవడంతో ఏ మేరకు బాలీవుడ్ మేకర్స్ ఐడియా వర్క్ అవుట్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే ఒక మంచి కథను సరిగ్గా డీల్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితం అయింది. ఈ సినిమాను అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేయగా, అజయ్ దేవగన్, శ్రియ, అక్షయ్ ఖన్నా మరియు టబు లు కీలక పాత్రలు చేశారు.
కాగా నిన్న మార్నింగ్ షో నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మంచి కలెక్షన్ లను సాధిస్తాయని నమ్మకంతో చిత్ర బృందం ఉందట. నిన్న రాత్రి అదనపు షో లు కూడా వేశారంటే సినిమాకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారీ కలెక్షన్ లు వచ్చినా రాకపోయినా బ్రహ్మాస్త్ర తర్వాత హిట్ అయిన సినిమాగా దృశ్యం 2 ను చెప్పుకోవచ్చు.