జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు సుడిగాలి సుధీర్. మొన్నటి వరకు కూడా ఈటీవీ లో ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ అనే కామెడీ షో ను చూడడానికి ప్రేక్షకులు తెగ ఎదురుచూసేవారు. అలా కమెడియన్ గా ఒక్కో మెట్టు ఎదుగుతూ కొన్ని సినిమాలలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ మరియు నిర్మాత అయిన రాజశేఖర్ రెడ్డి సుధీర్ ను హీరోగా పెట్టి సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఇందులో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణను హీరోయిన్ గా నటింపచేశారు. మొదటి సినిమా కావడం వలన సుధీర్ ప్ర్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కాలేకపోయాడు.

ఆ తర్వాత సుధీర్ శ్రీను రామ్ ప్రసాద్ లు ముఖ్య పాత్రధారులుగా 3 మంకీస్ సినిమా వచ్చింది. కానీ ఇది కూడా కమర్షియల్ గా హిట్ కాలేదు. గత నెలలో వచ్చిన వాంటెడ్ పండుగాడు అనే కామెడీ సినిమాతో వచ్చినా ఫలితం దక్కలేదు. ఇక సుధీర్ కమెడియన్ గానే కొనసాగొచ్చు... అతనికి హీరోగా అంత సీన్ లేదు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. కానీ వీటన్నింటినీ మనసులో పెట్టుకుని పడ్డగా రియాక్ట్ కాకుండా తన పని మీద తాను మనసు పెట్టి తీవ్రంగా శ్రమించి గాలోడు తో మళ్ళీ హీరోగా ప్రేక్షకుల ముందుకు గత వారమే వచ్చాడు.

సినిమా మొదటి రోజు మాత్రం అంతగా ఆకట్టుకొని టాక్ ను సొంతం చేసుకున్నా... ఆ తరువాత స్టడీ గా కలెక్షన్ లను సాధిస్తూ టార్గెట్ ను కూడా దాటేసింది. తనను విమర్శించిన వాళ్ళ నోళ్లు మూతబడేలా హీరోగా సాలిడ్ హిట్ ను అందుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా టోటల్ రన్ లో మొత్తం పది కోట్ల వరకు సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: