అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజ హెగ్డే , అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా నివేదా పేత్ రాజ్ , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. 12 జనవరి 2020 వ సంవత్సరం విడుదల అయిన అలా వైకుంఠపురంలో సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే అలా వైకుంఠపురంలో సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయి.

సినిమా ద్వారా అల్లు అర్జున్ కు పూజా హెగ్డే కు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ సినిమా విజయంలో ఎస్ ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇలా తెలుగు లో విడుదల అయిన అలా వైకుంఠపురంలో సినిమా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ గా నిలిచి అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేయడంతో ఈ సినిమాను హిందీ లో ప్రస్తుతం రీమిక్ చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాను హిందీ లో షేహజాదా అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ఈ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండగా , కృతి సనన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

రోహిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. గుల్షన్ కుమార్ మరియు అల్లు అరవింద్మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు హిందీ ప్రేక్షకుల నుండి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: