ఈ మధ్య కాలంలో సినీ స్టార్స్ అందరూ కూడా ఏదొక ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరుతున్నారు..తాజాగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు..ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు అతనికి ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. ఇటీవల హీరో కమల్ హాసన్ కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు హీరో ఉపేంద్ర కూడా ఆసుపత్రిలో చేరాడు.షూటింగ్లో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తగా వెంటనే బెంగళూరులోని నేలమంగళలోని హర్ష ఆసుపత్రికి వెళ్లి తగు చికిత్స తీసుకున్నాడు..
అయితే,ఉప్పీ ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆయన అభిమానులు టెన్షన్ కు గురయ్యారు. అయితే డస్ట్ అలర్జీ కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే తిరిగి సెట్స్లో పాల్గొన్నాడు ఉపేంద్ర. అనంతరం తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండడంతో ఫేస్బుక్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్ స్పాట్లోనే ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరాడు.
ప్రస్తుతం ఉప్పి,నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న కబ్జా చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన ఈ టీజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టనున్నారు కన్నడ స్టార్. ఈ మూవికి యూఐ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు వైరల్గా మారాయి. దీంతొ సినిమా పై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. గతంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి.ఆ లిస్ట్ లోకి ఈ సినిమా చేరుతుందో లేదో చూడాలి మరి..