నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. అటు నందమూరి ఫ్యామిలీ.. ఇటు నారా ఫ్యామిలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హరికృష్ణ మరణించిన తర్వాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సఖ్యతగా ప్రతి సినిమా కథలు చర్చించుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే బాలయ్య మాత్రం ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ను దగ్గరుండి మాట్లాడించిన దాఖలాలు లేవు. దీంతో పూర్తిస్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అవుతున్నారు.

ప్రపంచమే మెచ్చిన నటుడిని బాలయ్య ఎందుకు దూరం పెడుతున్నాడు అనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.  ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్య పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అసలు విషయం ఏమిటంటే బాలయ్య నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె ఆహా ఓటీటీ లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీజన్ వన్ పూర్తి చేసుకున్న ఈ షో రెండవ సీజన్ కూడా జరుపుకుంటుంది. అయితే ఈ రెండవ సీజన్లో కూడా రాజకీయ నాయకులతో పాటు నిన్న మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ హీరోలు కూడా బాలయ్య షోకి వస్తున్నారు.


ఇప్పటికే మహేష్ బాబు , ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కొక్కరిగా అందరిని ఆహ్వానిస్తున్నప్పుడు బాలయ్య ఎందుకు ఎన్టీఆర్ను ఆహ్వానించడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి . కానీ అదే అభిమానులు మరోపక్క బాలకృష్ణ వాస్తవానికి ఎన్టీఆర్ ను  షోలోకి పిలవలేదన్న కారణాన్ని కూడా వారు ఆహ్వానించలేకపోతున్నారు. మరి బాలకృష్ణ..  ఎన్టీఆర్ ను షోకి పిలవలేదా?  లేక కావాలనే పక్కన పెట్టాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంపై బాలయ్య వివరణ ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: