మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ఈ సంవత్సరం ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను మొదటగా పలకరించాడు. డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరిమూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించగా , రమేష్ వర్మమూవీ కి దర్శకత్వం వహించాడు.

ఆ తర్వాత శరత్ మండువ దర్శకత్వం లో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ తో రవితేజ ప్రేక్షకులను  పలకరించాడు. రాజేష విజయన్ ,  దివ్యాంశ కౌశిక్ ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను నిరాశ పరచిన  రవితేజ "ధమాకా" అనే మూవీ తో ఈ సంవత్సరం మరోసారి ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది.

సినిమా  138 నిమిషాల 47 సెకండ్ ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మాస్ మహారాజా రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే డిసెంబర్ 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా., త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: