‘వాల్తేర్ వీరయ్య’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన సెన్సార్ టాక్ అంటూ సోషల్ మీడియాలో అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తలు బాలకృష్ణ అభిమానుల వరకు చేరడంతో వారంతా టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బయటపడుతున్న ఈలీకుల ప్రకారం ఈమూవీ ఫస్ట్ హాఫ్ అంతా టోటల్ ఎంటర్ టైన్మెంట్ గా నడిస్తే సెకండ్ హాఫ్ ప్రారంభం అయిన దగ్గర నుండి సినిమా కథలో వేగం పెరిగి ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు అన్నమాటలు వినిపిస్తున్నాయి.

 

 
మరీ ముఖ్యంగా రవితేజా ఈసినిమాలో కనిపించే 40 నిముషాలు ఈసినిమా రేంజ్ ని మరొక స్థాయికి తీసుకువెళుతుంది అంటున్నారు. మరీ ముఖ్యంగా రవితేజా చిరంజీవి మధ్య చిత్రీకరించిన సీన్స్ లోని డైలాగ్స్ హై వోల్టేజ్ లో ఉంటూ ఈమూవీ చూస్తున్న సగటు ప్రేక్షకుడుని పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది అన్న లీకులు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన పాటలు కూడ ఇప్పటికే హిట్ అవ్వడంతో ఈమూవీని చూసే సగటు ప్రేక్షకుడుకి పండుగ విందు భోజనంగా ఉంటుందని మాటలు వినిపిస్తూ ఉండటంతో సంక్రాంతి రేస్ మొదలు కాకుండానే బాలకృష్ణ పై చిరంజీవి ఆదిపత్యం ఖరార్ అయిందా అంటూ వస్తున్న కామెంట్స్ బాలయ్య అభిమానులకు టెన్షన్ పెడుతున్నట్లు టాక్.

 

‘వాల్టేర్ వీరయ్య’ లో ఇద్దరు హీరోలు ఉంటే ‘వీరసింహా రెడ్డి’ లో అంతా బాలకృష్ణ పైనే ఆధారపడి ఉంది. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నప్పటికీ ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లో చిరంజీవి రవితేజాకామెడీ యాంగిల్ ముందు కేవలం బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఎంతవరకు ఆసినిమాను రక్షించగలుగుతాయి అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

 
దీనికితోడు యూత్ ‘వీరసింహా రెడ్డి’ పాటల కంటే ఎక్కువగా ‘వాల్టేర్ వీరయ్య’ మూవీ పాటలకు కనెక్ట్ అవుతూ ఉండటంతో ‘వీరసింహా రెడ్డి’ మూవీ కథలో ఊహించని ట్విస్ట్ లు లేకుంటే ‘వాల్తేర్ వీరయ్య’ తో పోటీ పడి గెలవడం కష్టం అంటూ వస్తున్న కామెంట్స్ విని బాలయ్య అభిమానులు టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం..

 


మరింత సమాచారం తెలుసుకోండి: